www.ntodaynews.com
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
తెలంగాణ
ధర్మపురిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
నివాళులర్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ ధర్మపురి పట్టణ కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొప్పుల ఈశ్వర్ హాజరై, వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. నేటి యువత వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత తలచుకుంటే అసాధ్యం ఏదీ లేదని, క్రమశిక్షణతో పాటు పట్టుదల కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ అయ్యోరి రాజేష్, పట్టణ పార్టీ కన్వీనర్ బండారి రంజిత్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, వివేకానంద యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#SwamiVivekananda
#VivekanandaJayanti
#NationalYouthDay
#YouthInspiration
#Dharmapuri
#TelanganaNews
#PoliticalNews
#BRS
Follow us on
Website
Facebook
Instagram
YouTube 