www.ntodaynews.com
టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
కల్వకుంట్ల కవిత సమక్షంలో చేరిక.. రానున్న ఎన్నికల్లో గెలుపు మనదేనని ధీమా
రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి బోడ జనార్దన్ తన అనుచరులతో కలిసి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు పార్టీ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బోడ జనార్దన్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధికారంలోకి వస్తుందని పూర్తి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత పాలన సాగించిన పార్టీలను, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు