టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం:
రావులపాలెం కొత్తకాలనీలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని టీడీపీకి చెందిన కో-ఆప్టెడ్ సభ్యుడు, పార్టీ నాయకుడు షరీఫ్ గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు.
ఈ ఘటనపై వారు రావులపాలెం సీఐ కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పాఠశాలకు వెళ్లి బాలికతో పాటు సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టినట్లు సమాచారం.
ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, వాస్తవాలు నిర్ధారించి సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.