www.ntodaynews.com
టిఆర్ఎస్లో చేరికల జోరు.. మాజీ మంత్రి బోడ జనార్ధన్ నిర్ణయం
తెలంగాణ
టిఆర్ఎస్లో చేరికల జోరు.. మాజీ మంత్రి బోడ జనార్ధన్ నిర్ణయం
తెలంగాణ రాష్ట్రం లో నూతనంగా ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీలో చేరికల ఊపు కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి బోడ జనార్ధన్ కల్వకుంట్ల కవిత తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం త్వరలోనే తన అనుచరులతో కలిసి టిఆర్ఎస్లో చేరనున్నట్లు జనార్ధన్ స్పష్టం చేశారు.
ఇప్పటికే పార్టీ స్థాపన దశ నుంచే పలువురు నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా కవితకు మద్దతు తెలపడం గమనార్హం. ఇతర పార్టీల నుంచి వరుసగా నాయకులు చేరుతుండటంతో టిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నేతలు కూడా చేరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.