BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 07:28 AM
100 వీక్షణలు

ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య

నూజివీడు: రాత్రి వేళల్లో జరిగే రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు నూజివీడు రూరల్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాలు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనల మేరకు నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్, రూరల్ ఎస్‌ఐ జ్యోతిబసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా రాత్రి సమయంలో రహదారులపై సంచరించే ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. చీకటి వేళల్లో దూరం నుంచే ట్రాక్టర్లు స్పష్టంగా కనిపించేలా ఈ స్టిక్కర్లు ఉపయోగపడతాయని, దీంతో ప్రమాదాల అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పోలీసులు తెలిపారు.

వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన అధికారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదాలకు ప్రధాన కారణాలని హెచ్చరించారు. వాహనాలపై రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక లైట్లు వంటి భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా వ్యవసాయ వాహనాలు రాత్రి వేళల్లో ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. "వేగం వద్దు.. ప్రాణం ముద్దు" అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు.

"రహదారి నియమాలను పాటిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం. వేగాన్ని నియంత్రిద్దాం.. సురక్షితంగా గమ్యానికి చేరుకుందాం" అని నూజివీడు రూరల్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.