www.ntodaynews.com
టీ20లో టీమిండియా విజయం
ఆంధ్రప్రదేశ్
టీ20లో టీమిండియా విజయం
విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఆనందం పంచుకున్న అమడగూరు ప్రజలు
NTODAY NEWS: అమడగూరు ప్రతినిధి రామాంజనేయులు
టీ20 ప్రపంచకప్లో ఛాంపియన్గా నిలిచిన టీమిండియాను చూసి దేశమంతా గర్విస్తోంది. ప్రపంచ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించడంతో అభిమానులు, క్రీడాభిమానులు భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ ప్రతిభతో దేశానికి గౌరవం తీసుకొచ్చారని పలువురు అభినందించారు.
ఈ సందర్భంగా అమడగూరు మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్లారు. టీమిండియా విజయాన్ని ఆనందంగా జరుపుకుంటూ విద్యార్థులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారత జట్టు సాధించిన విజయం దేశ యువతకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని కష్టపడి శ్రమిస్తే గొప్ప విజయాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్, క్రీడ ఉపాధ్యాయుడు ముని మరియు ఇతరులు పాల్గొన్నారు.
#TeamIndia #T20Victory #IndianCricket #Amadaguru #StudentRally #SportsInspiration #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube