www.ntodaynews.com
తాడేపల్లిగూడెంలో ఏసీబీ వలలో సర్వేయర్
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెం: మున్సిపల్ సర్వేయర్గా పనిచేస్తున్న రౌతు రామకృష్ణ మంగళవారం ఏసీబీ వలలో చిక్కాడు. స్థలం సర్వే రిపోర్టు ఇచ్చేందుకు యజమాని నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
మున్సిపల్ సర్వేయర్తో పాటు ఇంచార్జ్ డివిజనల్ సర్వేయర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణపై అవినీతి ఆరోపణలు కొత్తేమీ కావని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా పలుమార్లు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై ఏసీబీ అధికారులు సర్వేయర్తో పాటు సంబంధిత సిబ్బంది, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.