www.ntodaynews.com
యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
NTODAYNEWS పల్నాడు జిల్లా యడ్లపాడు జాతీయ రహదారిపై ఒక కారు ప్రమాదం చోటుచేసుకుంది. యడ్లపాడుకు చెందిన జగదీష్ (75) తన 8 ఏళ్ల మనవరాలు జగదీశ్వరితో కలిసి కారులో తిమ్మాపురం వైపు బయల్దేరారు. మార్గమధ్యంలో తిమ్మాపురం సమీపానికి రాగానే వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు హైవేపై మూడు పల్టీలు కొట్టగా, లోపల ఉన్న తాత, మనవరాలికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన 108 సిబ్బంది బాధితులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు.