www.ntodaynews.com
తాతకుంట్లలో మలేరియా వ్యతిరేక ర్యాలీ, డ్రై డే ఫ్రైడే కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విస్సన్నపేట, జూన్ 12: మండలం తాతకుంట్ల గ్రామంలో ఈరోజు పి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మహోత్సవ ర్యాలీ మరియు "డ్రై డే ఫ్రైడే" కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డి. రాజు నాయక్ పాల్గొని వర్షాకాలంలో కీటక జనిత వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి SK. బాబు వలి, ఎంపిహెచ్ఎస్ వీరభద్రరావు, MPHAs, ANMs, MLHP ఆశాలు వంటి సిబ్బంది పాల్గొని, వాడుకదారులందరికీ సమగ్ర సమాచారాన్ని అందించారు.
వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి కీటక జనిత వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉండే నేపథ్యంలో, స్థానిక ప్రజలలో సురక్షిత జీవనశైలిని పెంపొందించడం కోసం ఈ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమం కీలకంగ చేపట్టబడింది