www.ntodaynews.com
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అండ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన తోమండ్రు నాగమణి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స ఖర్చులను భరించలేని పరిస్థితిలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ను కలిసి ఆర్థిక, వైద్య సహాయం అందించాలని విన్నవించారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, హైదరాబాద్లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మెరుగైన చికిత్స పొందేందుకు అవసరమైన సిఫార్సు లేఖను అందజేశారు.
ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలిచి అవసరమైన వైద్య సహాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.