www.ntodaynews.com
తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
తెలంగాణ
తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూములపై యథాస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లను కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తూ అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, భూములు కోల్పోయిన ప్రతి బాధితుడికి ఇళ్ల స్థలం మరియు గృహాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విచారణ అనంతరం కోర్టు, కేవలం 311 మందికే పరిమితం కాకుండా, అక్కడ ఇళ్లు కోల్పోయిన ప్రతి అర్హుడికి న్యాయం చేయాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో భూదాన్ భూములపై ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మార్పులు చేయకుండా కొనసాగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.