తెలంగాణ జలసిరి పై అవగాహన సదస్సు
తెలంగాణ జలసిరి పై అవగాహన సదస్సు
చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో 'తెలంగాణ జలసిరి' పథకం, భూగర్భ జలాల పెంపుపై సర్పంచ్ కాటం వెంకటేశం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీబీజీ రాంజీ ద్వారా ఉపాధి కల్పిస్తూ, గ్రామసభ ద్వారా పనులను నిర్ధారించుకుని రైతులు పనులు చేపట్టవచ్చని తెలిపారు. భూగర్భ జలాలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు, పంట గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వడపడిన బోర్ల చుట్టూ కందకం తీసి రాళ్లు, ఇసుకతో నింపడం వల్ల డ్రై అయిన బోర్లలో మళ్లీ నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్వాడీలు పెద్ద భవనాల పైకప్పుల నీటిని గుంతల్లోకి మళ్లించాలని కోరారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతల నిర్మాణంలో గ్రామ పాలకవర్గం, ఫీల్డ్ అసిస్టెంట్లు సహకరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, వార్డు సభ్యులు ఏర్పుల యాదయ్య, ఏర్పుల మల్లేశ్వరి, సాగర్ల నవ్యశ్రీ, నాగరాజు, ఆనగంటి నరేష్, ఏర్పుల నరసింహ, నీలకంఠం నరేష్తో పాటు ఆశ వర్కర్లు, VBKs తదితరులు పాల్గొన్నారు.