www.ntodaynews.com
తెలంగాణకు 15.90 టీఎంసీల హక్కు సాధించారా?: హరీశ్ రావు
తెలంగాణ
తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల కృష్ణా జలాల హక్కు సాధించారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభాన్ని సంబరంగా చేసుకోవడం కాకుండా, తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలపై ఎలాంటి హామీలు సాధించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
అలాగే, ఆర్డీఎస్ కింద తెలంగాణకు కేటాయించిన నీటిపై స్పష్టమైన హామీలు సాధించారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అదనపు నీటి వినియోగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని విమర్శించారు.
అంతేకాకుండా, కర్ణాటకలో చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణ నీటి హక్కులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.