BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

తెలంగాణలో వడదెబ్బకు ఒక్కరోజే 52 మంది బలి

తెలంగాణ
/ తెలంగాణ / హైదరాబాద్
26 May, 2026 - 12:59 PM
228 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అంచనాలకు అందడం లేదు. రోహిణి కార్తె ప్రవేశంతో భానుడు మరింత నిప్పుల చెరుగుతున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరడమే కాకుండా, ఊపిరి సలపనివ్వని వడగాలులు తోడవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. సోమవారం ఒక్కరోజే వడదెబ్బ కారణంగా తెలంగాణ  రాష్ట్రంలో 52 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ​గడిచిన వారం రోజుల్లోనే మృతుల సంఖ్య 222 కి చేరడం చూస్తుంటే, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎంతటి విపత్కరంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాల వారీగా 

​సరిహద్దు జిల్లాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, నిన్న సంభవించిన మరణాలలో 

​ఉమ్మడి వరంగల్ జిల్లా  అత్యధికంగా 16 మంది మృతి చెందారు.bఉమ్మడి ఖమ్మం జిల్లా  ఎండల తీవ్రతకు 14 మంది బలయ్యారు. ​ఉమ్మడి కరీంనగర్ జిల్లా  వడదెబ్బ కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ​ఉమ్మడి నల్గొండ జిల్లా: ఆరుగురు (6) మృతి చెందారు.​నిజామాబాద్ జిల్లా: నలుగురు (4) బలయ్యారు. ​సిద్దిపేట జిల్లా: ఒకరు (1) మరణించారు. సాధారణంగా 'రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి' అంటారు. దానికి తగ్గట్టే ప్రస్తుతం వాతావరణం ఉంది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నానికి అది అగ్నిగుండంగా మారుతోంది. ముఖ్యంగా వృద్ధులు, కూలీలు, మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వడగాలుల తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నారు.

​వారంలోనే 222 మంది చనిపోవడం అనేది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, ఒక రకమైన ప్రకృతి విపత్తుగా పరిగణించాల్సి ఉంటుంది.