BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

తెలంగాణలో వడదెబ్బకు ఒక్కరోజే 52 మంది బలి

తెలంగాణ
/ తెలంగాణ / హైదరాబాద్
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
26 May, 2026 - 12:59 PM
142 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అంచనాలకు అందడం లేదు. రోహిణి కార్తె ప్రవేశంతో భానుడు మరింత నిప్పుల చెరుగుతున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరడమే కాకుండా, ఊపిరి సలపనివ్వని వడగాలులు తోడవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. సోమవారం ఒక్కరోజే వడదెబ్బ కారణంగా తెలంగాణ  రాష్ట్రంలో 52 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ​గడిచిన వారం రోజుల్లోనే మృతుల సంఖ్య 222 కి చేరడం చూస్తుంటే, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎంతటి విపత్కరంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాల వారీగా 

​సరిహద్దు జిల్లాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, నిన్న సంభవించిన మరణాలలో 

​ఉమ్మడి వరంగల్ జిల్లా  అత్యధికంగా 16 మంది మృతి చెందారు.bఉమ్మడి ఖమ్మం జిల్లా  ఎండల తీవ్రతకు 14 మంది బలయ్యారు. ​ఉమ్మడి కరీంనగర్ జిల్లా  వడదెబ్బ కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ​ఉమ్మడి నల్గొండ జిల్లా: ఆరుగురు (6) మృతి చెందారు.​నిజామాబాద్ జిల్లా: నలుగురు (4) బలయ్యారు. ​సిద్దిపేట జిల్లా: ఒకరు (1) మరణించారు. సాధారణంగా 'రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి' అంటారు. దానికి తగ్గట్టే ప్రస్తుతం వాతావరణం ఉంది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నానికి అది అగ్నిగుండంగా మారుతోంది. ముఖ్యంగా వృద్ధులు, కూలీలు, మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వడగాలుల తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నారు.

​వారంలోనే 222 మంది చనిపోవడం అనేది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, ఒక రకమైన ప్రకృతి విపత్తుగా పరిగణించాల్సి ఉంటుంది.