BREAKING
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి మంత్రి పొంగులేటి అహంకార వైఖరిని ఖండిస్తున్నాం: బీసీ సమాజ్ తెలంగాణలో వడదెబ్బకు ఒక్కరోజే 52 మంది బలి పల్లె వెలుగు బస్సుకు Express బోర్డు - ప్రయాణికులపై అదనపు భారం పగటిపూటే ప్రజాధనానికి చితి.. చాట్రాయిలో వెలుగుతున్న వీధి దీపాలపై ప్రజల ఆగ్రహం ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా కొంపల్లి సూర్య నియామకం కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో నేరుగా అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ ​తాటి చెట్టుపై నుండి జారిపడి గీతా కార్మికుడు మృతి: NTODAY NEWS ​సూర్యాపేట ప్రముఖ పారిశ్రామికవేత్తలు సుదర్శన్ రాజు, సుజన్ రాజులకు ఘనంగా జన్మదిన వేడుకలు.. భారీగా అన్నదానం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి మంత్రి పొంగులేటి అహంకార వైఖరిని ఖండిస్తున్నాం: బీసీ సమాజ్ తెలంగాణలో వడదెబ్బకు ఒక్కరోజే 52 మంది బలి పల్లె వెలుగు బస్సుకు Express బోర్డు - ప్రయాణికులపై అదనపు భారం పగటిపూటే ప్రజాధనానికి చితి.. చాట్రాయిలో వెలుగుతున్న వీధి దీపాలపై ప్రజల ఆగ్రహం ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా కొంపల్లి సూర్య నియామకం కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో నేరుగా అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ ​తాటి చెట్టుపై నుండి జారిపడి గీతా కార్మికుడు మృతి: NTODAY NEWS ​సూర్యాపేట ప్రముఖ పారిశ్రామికవేత్తలు సుదర్శన్ రాజు, సుజన్ రాజులకు ఘనంగా జన్మదిన వేడుకలు.. భారీగా అన్నదానం
www.ntodaynews.com

తెలంగాణలో వడదెబ్బకు ఒక్కరోజే 52 మంది బలి

తెలంగాణ
/ తెలంగాణ / హైదరాబాద్
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
26 May, 2026 - 12:59 PM
61 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అంచనాలకు అందడం లేదు. రోహిణి కార్తె ప్రవేశంతో భానుడు మరింత నిప్పుల చెరుగుతున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరడమే కాకుండా, ఊపిరి సలపనివ్వని వడగాలులు తోడవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. సోమవారం ఒక్కరోజే వడదెబ్బ కారణంగా తెలంగాణ  రాష్ట్రంలో 52 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ​గడిచిన వారం రోజుల్లోనే మృతుల సంఖ్య 222 కి చేరడం చూస్తుంటే, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎంతటి విపత్కరంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాల వారీగా 

​సరిహద్దు జిల్లాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, నిన్న సంభవించిన మరణాలలో 

​ఉమ్మడి వరంగల్ జిల్లా  అత్యధికంగా 16 మంది మృతి చెందారు.bఉమ్మడి ఖమ్మం జిల్లా  ఎండల తీవ్రతకు 14 మంది బలయ్యారు. ​ఉమ్మడి కరీంనగర్ జిల్లా  వడదెబ్బ కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ​ఉమ్మడి నల్గొండ జిల్లా: ఆరుగురు (6) మృతి చెందారు.​నిజామాబాద్ జిల్లా: నలుగురు (4) బలయ్యారు. ​సిద్దిపేట జిల్లా: ఒకరు (1) మరణించారు. సాధారణంగా 'రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి' అంటారు. దానికి తగ్గట్టే ప్రస్తుతం వాతావరణం ఉంది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నానికి అది అగ్నిగుండంగా మారుతోంది. ముఖ్యంగా వృద్ధులు, కూలీలు, మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వడగాలుల తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నారు.

​వారంలోనే 222 మంది చనిపోవడం అనేది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, ఒక రకమైన ప్రకృతి విపత్తుగా పరిగణించాల్సి ఉంటుంది.