BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. 24 గంటల నిరీక్షణ!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 May, 2026 - 11:30 AM
83 వీక్షణలు

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేలాదిగా తరలివస్తున్న భక్తులతో కొండంతా కిక్కిరిసిపోయింది. అన్ని దర్శన కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా, క్యూ లైన్ శిలాతోరణం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించింది. సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 24 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, నిన్న ఒక్కరోజే 78,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 45,283 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ఇక శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.4.15 కోట్లకు చేరుకుంది. అలాగే 4.07 లక్షల లడ్డూలు విక్రయమవడం భక్తుల రద్దీకి అద్దం పడుతోంది.

వేసవి సెలవులు, వారాంతం కావడంతో రాబోయే రోజుల్లో కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.