BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. 24 గంటల నిరీక్షణ!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 May, 2026 - 11:30 AM
119 వీక్షణలు

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేలాదిగా తరలివస్తున్న భక్తులతో కొండంతా కిక్కిరిసిపోయింది. అన్ని దర్శన కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా, క్యూ లైన్ శిలాతోరణం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించింది. సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 24 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, నిన్న ఒక్కరోజే 78,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 45,283 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ఇక శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.4.15 కోట్లకు చేరుకుంది. అలాగే 4.07 లక్షల లడ్డూలు విక్రయమవడం భక్తుల రద్దీకి అద్దం పడుతోంది.

వేసవి సెలవులు, వారాంతం కావడంతో రాబోయే రోజుల్లో కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.