BREAKING
పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.
www.ntodaynews.com

తిరుపతిలో కలకలం రేపిన కుళ్లిన మాంసం నిల్వలు – భారీ దాడుల్లో వెలుగులోకి నిజాలు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 06:28 AM
30 వీక్షణలు

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భారీగా కుళ్లిన మాంసం నిల్వలు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరపాలక సంస్థ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వందల కిలోల పాడైపోయిన మాంసం స్వాధీనం చేసుకున్నారు.

మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ నేతృత్వంలో 28వ వార్డు పరిధిలోని పెద్దపీర్ల చావడి మటన్ మార్కెట్, స్లాటర్ హౌస్‌లపై అధికారులు దాడులు చేశారు. సుమారు 15 దుకాణాల్లోని ఫ్రీజర్లను తనిఖీ చేయగా, రోజులు తరబడి నిల్వ ఉంచిన మేకలు, పొట్టేళ్ల భాగాలు పూర్తిగా కుళ్లిపోయి పురుగులు పట్టిన స్థితిలో లభ్యమయ్యాయి. మొత్తం 500 నుంచి 1000 కిలోల వరకు మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డ్‌లో ధ్వంసం చేశారు.

విచారణలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు నాణ్యత లేని మాంసాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేసి హోటళ్లు, బిర్యానీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం కలిగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.