BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

తిరుపతిలో కలకలం రేపిన కుళ్లిన మాంసం నిల్వలు – భారీ దాడుల్లో వెలుగులోకి నిజాలు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 06:28 AM
176 వీక్షణలు

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భారీగా కుళ్లిన మాంసం నిల్వలు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరపాలక సంస్థ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వందల కిలోల పాడైపోయిన మాంసం స్వాధీనం చేసుకున్నారు.

మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ నేతృత్వంలో 28వ వార్డు పరిధిలోని పెద్దపీర్ల చావడి మటన్ మార్కెట్, స్లాటర్ హౌస్‌లపై అధికారులు దాడులు చేశారు. సుమారు 15 దుకాణాల్లోని ఫ్రీజర్లను తనిఖీ చేయగా, రోజులు తరబడి నిల్వ ఉంచిన మేకలు, పొట్టేళ్ల భాగాలు పూర్తిగా కుళ్లిపోయి పురుగులు పట్టిన స్థితిలో లభ్యమయ్యాయి. మొత్తం 500 నుంచి 1000 కిలోల వరకు మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డ్‌లో ధ్వంసం చేశారు.

విచారణలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు నాణ్యత లేని మాంసాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేసి హోటళ్లు, బిర్యానీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం కలిగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.