తిరువూరులో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం
తిరువూరు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని యూపీహెచ్సి ఇంచార్జ్ వైద్యాధికారిణి డాక్టర్ సాయి సుధా భవ్య తెలిపారు. తిరువూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించబడింది.
కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి స్థానికులకు అవగాహన కల్పించారు. నివాస గృహాల చుట్టూ నీటి నిల్వలు, కాళీ పాత్రలు, తొట్లు దోమలు, లార్వాలు పెరుగడానికి కారణమవుతాయని సూచిస్తూ వాటిని సక్రమంగా మూతపెట్టి ఉంచాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రభావితం కాకుండా కాచి, చల్లార్చిన మంచినీరు తాగడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ముఖ్యమని గుర్తుచేశారు.
కార్యక్రమాన్ని మలేరియా సబ్ యూనిట్ అధికారి బాబావలి, హెల్త్ సూపర్వైజర్ కే. రవి, హెల్త్ విజిటర్ శ్యామల పర్యవేక్షించారు.