BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 25 March 2026, 12:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఇంధన సంక్షోభం… పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 12:02 PM
158 వీక్షణలు

తిరువూరులో ఇంధన సంక్షోభం… పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఇంధన కొరత తీవ్రంగా మారింది. పట్టణంలోని నాలుగు పెట్రోల్ బంకుల్లో మూడు బంకులు ఫ్యూయల్ లేక మూతపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఒక రిలయన్స్ బంక్ ముందు భారీగా క్యూ కట్టిన వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పెట్రోల్ బంకులు పూర్తిగా మూసివేస్తారన్న వదంతులు వేగంగా వ్యాపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవాలని భావిస్తూ బంకుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఇక ఆయిల్ కంపెనీలు క్రెడిట్ సప్లై నిలిపివేయడంతో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడినట్లు సమాచారం. ఈ సమస్య త్వరగా పరిష్కరించకపోతే రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇంధన సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.