BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

తిరువూరులో ఇంధన సంక్షోభం… పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 12:02 PM
59 వీక్షణలు

తిరువూరులో ఇంధన సంక్షోభం… పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఇంధన కొరత తీవ్రంగా మారింది. పట్టణంలోని నాలుగు పెట్రోల్ బంకుల్లో మూడు బంకులు ఫ్యూయల్ లేక మూతపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఒక రిలయన్స్ బంక్ ముందు భారీగా క్యూ కట్టిన వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పెట్రోల్ బంకులు పూర్తిగా మూసివేస్తారన్న వదంతులు వేగంగా వ్యాపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవాలని భావిస్తూ బంకుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఇక ఆయిల్ కంపెనీలు క్రెడిట్ సప్లై నిలిపివేయడంతో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడినట్లు సమాచారం. ఈ సమస్య త్వరగా పరిష్కరించకపోతే రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇంధన సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.