www.ntodaynews.com
తిరువూరులో కక్షిదారులకు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తిరువూరులో కక్షిదారులకు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం
తిరువూరు, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు మహారాజశ్రీ కోర్టు వారి పరిధిలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో క్షిదారులకు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మీడియేటర్ మాకరాజు రామ్మోహన్ రాజు పాల్గొని క్షిదారులకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవలు, మధ్య వర్తిత్వం, వారి హక్కులు, చట్టపరమైన రక్షణ, వివాదాల పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించారు. న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, సమస్యలు ఎదురైనప్పుడు చట్టబద్ధ మార్గాలను ఆశ్రయించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు, సంబంధిత అధికారులు, క్షిదారులు పాల్గొన్నారు.