BREAKING
చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ
www.ntodaynews.com

తిరువూరులో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 09:58 PM
23 వీక్షణలు

తిరువూరు, ఆగస్టు 2: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ సమత, లెజెండ్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ గంపలగూడెం–డైమండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సమత అధ్యక్షుడిగా పి.వి. రావు, లెజెండ్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ గంపలగూడెం–డైమండ్స్ అధ్యక్షుడిగా చిత్తలూరి జగదీష్, ఇతర బాధ్యతలను నాళ్లా విజయలక్ష్మి కుమారి, కుందా నాగభూషణరావు స్వీకరించారు. నూతన కార్యవర్గ సభ్యులతో లయన్ లింగం శివశంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించాలని, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సేవలందిస్తూ సమాజ అభ్యున్నతికి లయన్స్ క్లబ్ సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ జిల్లా గవర్నర్లు ఎస్.వి.ఎన్. నివృత్తరావు, జేయన్ శంకర్ గుప్తా, దేవినేని కిషోర్ పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నూజివీడు, విస్సన్నపేట, మైలవరం, గంపలగూడెం ప్రాంతాలకు చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రముఖులు, సేవా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.