BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

తిరువూరులో సేవాస్ఫూర్తి కొత్త అడుగు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 08:54 PM
73 వీక్షణలు

తిరువూరులో సేవాస్ఫూర్తి కొత్త అడుగు… డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ ప్రారంభం 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సేవా కార్యక్రమాలకు కొత్త ఊపు వచ్చింది. జన్మభూమి రోడ్‌లో జయకృష్ణ హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన “డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్” ను రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండటం ఎంత ముఖ్యమో పేర్కొంటూ, ఇలాంటి బ్లడ్ సెంటర్లు ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తిరువూరు ప్రాంత ప్రజలకు ఇది పెద్ద వరమని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కంచర్ల ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పంతంగి శ్రీనివాసరావు, టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ప్రముఖ వైద్యులు డా. పెనుబల్లి నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పసుమర్తి వెంకటేశ్వరరావు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

స్థానికంగా అత్యవసర రక్త అవసరాలకు ఈ సెంటర్ ఒక నమ్మకమైన ఆధారంగా మారనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.