BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

తిరువూరులో సేవాస్ఫూర్తి కొత్త అడుగు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 08:54 PM
111 వీక్షణలు

తిరువూరులో సేవాస్ఫూర్తి కొత్త అడుగు… డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ ప్రారంభం 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సేవా కార్యక్రమాలకు కొత్త ఊపు వచ్చింది. జన్మభూమి రోడ్‌లో జయకృష్ణ హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన “డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్” ను రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండటం ఎంత ముఖ్యమో పేర్కొంటూ, ఇలాంటి బ్లడ్ సెంటర్లు ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తిరువూరు ప్రాంత ప్రజలకు ఇది పెద్ద వరమని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కంచర్ల ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పంతంగి శ్రీనివాసరావు, టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ప్రముఖ వైద్యులు డా. పెనుబల్లి నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పసుమర్తి వెంకటేశ్వరరావు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

స్థానికంగా అత్యవసర రక్త అవసరాలకు ఈ సెంటర్ ఒక నమ్మకమైన ఆధారంగా మారనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.