BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

తిరువూరులో సేవాస్ఫూర్తి కొత్త అడుగు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 08:54 PM
52 వీక్షణలు

తిరువూరులో సేవాస్ఫూర్తి కొత్త అడుగు… డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్ ప్రారంభం 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సేవా కార్యక్రమాలకు కొత్త ఊపు వచ్చింది. జన్మభూమి రోడ్‌లో జయకృష్ణ హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన “డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ సెంటర్” ను రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండటం ఎంత ముఖ్యమో పేర్కొంటూ, ఇలాంటి బ్లడ్ సెంటర్లు ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తిరువూరు ప్రాంత ప్రజలకు ఇది పెద్ద వరమని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కంచర్ల ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పంతంగి శ్రీనివాసరావు, టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ప్రముఖ వైద్యులు డా. పెనుబల్లి నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పసుమర్తి వెంకటేశ్వరరావు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

స్థానికంగా అత్యవసర రక్త అవసరాలకు ఈ సెంటర్ ఒక నమ్మకమైన ఆధారంగా మారనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.