BREAKING
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం
www.ntodaynews.com

తిరువూరులో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:50 PM
8 వీక్షణలు

తిరువూరులో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో నిర్వహణ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలోని పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు తిరువూరు పట్టణంలోని శ్రీ వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో వ్యాసరచన పోటీలు జరుగనున్నాయి.

పోటీలకు ఈ క్రింది అంశాలను ఎంపిక చేశారు.

ప్లాస్టిక్ రహిత సమాజం – నా వంతు పాత్ర

మొబైల్ ఫోన్ నరకమా? శాపమా? విద్యార్థులపై దాని ప్రభావం

వృద్ధాశ్రమాలు సమాజానికి అవసరమా? ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యత

పుస్తక పఠనం వల్ల ప్రయోజనం

విద్యార్థులు పై నాలుగు అంశాల్లో తమకు నచ్చిన ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకుని వ్యాసం రాయవచ్చని నిర్వాహకులు తెలిపారు. వ్యాసాన్ని తెలుగు లేదా ఆంగ్ల భాషల్లో రాయవచ్చని పేర్కొన్నారు.

9, 10వ తరగతుల విద్యార్థులందరూ ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని జనసేన పార్టీ తిరువూరు నియోజకవర్గం కోరింది.