తిరువూరులో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
తిరువూరులో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలోని పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు తిరువూరు పట్టణంలోని శ్రీ వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో వ్యాసరచన పోటీలు జరుగనున్నాయి.
పోటీలకు ఈ క్రింది అంశాలను ఎంపిక చేశారు.
ప్లాస్టిక్ రహిత సమాజం – నా వంతు పాత్ర
మొబైల్ ఫోన్ నరకమా? శాపమా? విద్యార్థులపై దాని ప్రభావం
వృద్ధాశ్రమాలు సమాజానికి అవసరమా? ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యత
పుస్తక పఠనం వల్ల ప్రయోజనం
విద్యార్థులు పై నాలుగు అంశాల్లో తమకు నచ్చిన ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకుని వ్యాసం రాయవచ్చని నిర్వాహకులు తెలిపారు. వ్యాసాన్ని తెలుగు లేదా ఆంగ్ల భాషల్లో రాయవచ్చని పేర్కొన్నారు.
9, 10వ తరగతుల విద్యార్థులందరూ ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని జనసేన పార్టీ తిరువూరు నియోజకవర్గం కోరింది.