BREAKING
5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం
www.ntodaynews.com

తమిళనాడులో సంచలనం సృష్టించిన తూత్తుకుడి కస్టడీ హత్యల కేసు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 10:56 PM
102 వీక్షణలు

తమిళనాడులో సంచలనం సృష్టించిన తూత్తుకుడి కస్టడీ హత్యల కేసులో చివరకు న్యాయం వెలుగుచూసింది.

2020 లాక్‌డౌన్ సమయంలో సాతంకుళంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాత్రి 9 గంటల తర్వాత మొబైల్ షాప్ తెరిచి ఉంచాడన్న కారణంతో పోలీసులు జయరాజ్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లగా, ఆయనను చూడటానికి వచ్చిన కుమారుడు బెన్నిక్స్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఆ రాత్రంతా స్టేషన్‌లో వారిద్దరిపై అమానుషంగా హింస కొనసాగింది. చెక్క టేబుల్‌కు కట్టివేసి లాఠీలతో దారుణంగా కొట్టినట్లు తరువాత వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాల కారణంగా జూన్ 22న బెన్నిక్స్, జూన్ 23న జయరాజ్ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించారు. మొదట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తండ్రీకొడుకులే దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నా, దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆ వాదనలు అబద్ధమని తేలింది.

సుదీర్ఘంగా ఆరు సంవత్సరాల విచారణ అనంతరం, మదురై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు సహా మొత్తం 9 మంది పోలీసులను హత్య కేసులో దోషులుగా నిర్ధారించింది.

ఈ కేసులో శిక్ష ఖరారు మార్చి 30న ప్రకటించనున్నారు.

ఆరు సంవత్సరాల తర్వాత అయినా న్యాయం జరిగిందన్న భావన ఉన్నా, ఈ ఘటన దేశంలో కస్టడీ హింసపై మరొకసారి తీవ్రమైన చర్చకు దారితీసింది.