BREAKING
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..! విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!
www.ntodaynews.com

తమిళనాడులో సంచలనం సృష్టించిన తూత్తుకుడి కస్టడీ హత్యల కేసు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 10:56 PM
64 వీక్షణలు

తమిళనాడులో సంచలనం సృష్టించిన తూత్తుకుడి కస్టడీ హత్యల కేసులో చివరకు న్యాయం వెలుగుచూసింది.

2020 లాక్‌డౌన్ సమయంలో సాతంకుళంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాత్రి 9 గంటల తర్వాత మొబైల్ షాప్ తెరిచి ఉంచాడన్న కారణంతో పోలీసులు జయరాజ్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లగా, ఆయనను చూడటానికి వచ్చిన కుమారుడు బెన్నిక్స్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఆ రాత్రంతా స్టేషన్‌లో వారిద్దరిపై అమానుషంగా హింస కొనసాగింది. చెక్క టేబుల్‌కు కట్టివేసి లాఠీలతో దారుణంగా కొట్టినట్లు తరువాత వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాల కారణంగా జూన్ 22న బెన్నిక్స్, జూన్ 23న జయరాజ్ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించారు. మొదట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తండ్రీకొడుకులే దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నా, దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆ వాదనలు అబద్ధమని తేలింది.

సుదీర్ఘంగా ఆరు సంవత్సరాల విచారణ అనంతరం, మదురై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు సహా మొత్తం 9 మంది పోలీసులను హత్య కేసులో దోషులుగా నిర్ధారించింది.

ఈ కేసులో శిక్ష ఖరారు మార్చి 30న ప్రకటించనున్నారు.

ఆరు సంవత్సరాల తర్వాత అయినా న్యాయం జరిగిందన్న భావన ఉన్నా, ఈ ఘటన దేశంలో కస్టడీ హింసపై మరొకసారి తీవ్రమైన చర్చకు దారితీసింది.