తోటమూల గీతాంజలిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
తోటమూల గీతాంజలిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తోటమూల
తోటమూలలోని గీతాంజలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు భాష గొప్పతనం, విశిష్టతను చాటుతూ ప్రసంగాలు, పద్యాలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, డాక్టర్ పి. నరేష్ మాట్లాడుతూ తెలుగు భాషను గౌరవించడం, మాతృభాషను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తెలుగు భాషా అభివృద్ధికి కృషి చేసిన మహనీయులను స్మరించుకుంటూ, భాషా విలువలను భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు.
తెలుగు కవులు, రచనలు, తెలుగు భాష చరిత్ర అంశాలపై విద్యార్థులకు క్విజ్ పోటీలు, ప్రసంగ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
తెలుగు ఉపాధ్యాయులు రవీంద్ర చారి ఆలపించిన పద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.