BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి సీతక్క

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 10:09 PM
103 వీక్షణలు

మహబూబాబాద్‌లో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా తప్పు చేస్తే చట్టం ముందు శిక్ష అనివార్యమని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తాత్సారం చేయలేదని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామని వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కారణంగా కేసు నమోదు ప్రక్రియలో ఒక్క రోజు ఆలస్యం జరిగిందని అంగీకరించిన సీతక్క.. సిట్ ఏర్పాటు కాలయాపన కోసం కాదని, నిజానిజాలు బయటకు తీసుకురావడానికేనని పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎంతటి స్థాయిలో ఉన్నా పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు.

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు మహిళలను గౌరవించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సీతక్క సూచించారు.

ఇదిలా ఉండగా, బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నట్లు సమాచారం. బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉండగా, వ్యక్తిగత కారణాలతో ఈ నెల 15న హాజరవుతానంటూ పేట్ బషీరాబాద్ పోలీసులకు, సిట్ అధికారులకు ఈ-మెయిల్ ద్వారా లేఖ పంపినట్లు తెలిసింది.