www.ntodaynews.com
తుపాకీ నుంచి హలానికి.. మావోయిస్ట్ సభ్యురాలు కొత్త జీవితానికి నాంది
తెలంగాణ
/
భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకప్పుడు చేతిలో తుపాకీ పట్టి అడవుల్లో సంచరించిన మావోయిస్ట్ సభ్యురాలు నేడు హలం పట్టి పొలం పనుల్లో నిమగ్నమై కనిపిస్తోంది.
చర్ల మండలం మారుమూల గిరిజన గ్రామం రాళ్పాపురానికి చెందిన పొడియం లక్ష్మి (28) కొన్నేళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి సాయుధ పోరాట బాట పట్టింది. అనంతరం మావోయిస్టు పార్టీలో అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యురాలిగా పనిచేసింది.
ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన లక్ష్మి ప్రస్తుతం తన గ్రామానికి చేరుకుని అమ్మమ్మ వద్ద ఉంటూ పోడు భూమిలో వ్యవసాయ పనులు చేస్తోంది. అలాగే అడవి ఉత్పత్తుల సేకరణ ద్వారా జీవనం సాగిస్తోంది.
ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల పునరావాస ప్యాకేజీని అందిస్తే శాశ్వత ఉపాధి ఏర్పాటుకు ఉపయోగించుకుంటానని ఆమె ప్రభుత్వాన్ని కోరింది.