
క్షత్రియ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ సీజన్ కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
NTODAY NEWS: చౌడేపల్లి
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చౌడేపల్లి మండలం కొత్త వీరప్పల్లి కేపీఎల్ మైదానంలో ఆదివారం క్షత్రియ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ సీజన్ కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ను రాజులూరు సుదర్శన్ రాజు, జతిన్ ఇంఫ్రా కంపెనీ ఎండీ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్షత్రియ సంఘం నాయకులు భక్తవత్సల రాజు, భాస్కర్ రాజు, లక్ష్మణ్ రాజు, వెంకటరమణ రాజు, సుబ్రహ్మణ్యం రాజు, శంకర్ రాజు, మేకం జమానపల్లె పురుషోత్తం రాజు, లోకేష్ రాజు పాల్గొన్నారు.
టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, జ్యోతి వెలిగించారు. అనంతరం కేపీఎల్ జెండాను ఎగురవేసి, క్రికెట్ జట్ల కెప్టెన్లతో టాస్ నిర్వహించి తొలి మ్యాచ్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గత 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న క్షత్రియ కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు నిలిచిపోయినా, ప్రస్తుతం 11వ సీజన్కు చేరుకుందని తెలిపారు. ఈ ఏడాది మొత్తం 11 జట్లు పోటీలో పాల్గొంటున్నాయని, మూడు రోజుల పాటు క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
టోర్నమెంట్లో విజేతలు, రన్నర్స్ మరియు తృతీయ స్థానంలో నిలిచిన జట్లకు ప్రైజ్ మనీతో పాటు టూ వీలర్, ల్యాప్టాప్, ఎల్ఈడీ టీవీ బహుమతులుగా అందజేయనున్నట్లు వెల్లడించారు. క్షత్రియ యువతను క్రీడల వైపు ప్రోత్సహించి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే కేపీఎల్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో క్షత్రియ సంఘం నాయకులు, కేపీఎల్ టోర్నమెంట్ నిర్వాహకులు, క్రికెట్ జట్లు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube