BREAKING
లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా
Date of Publish : 19 January 2026, 05:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

తెలంగాణ
19 Jan, 2026 - 05:15 AM
315 వీక్షణలు
సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: ధర్మారం ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రెండు సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సమ్మక్క–సారలమ్మ వనదేవతల జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతోందని తెలిపారు. జాతర నిర్వహణలో భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జాతర సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి కొరత లేకుండా బోరు బావులు, తాత్కాలిక నీటి ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా, శుభ్రత నిర్వహణకు ప్రత్యేక చర్యలు, రవాణా సౌకర్యాల మెరుగుదలతో పాటు వైద్య శిబిరాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో కలిసి సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతర పనుల సమీక్ష సమావేశంలో పాల్గొని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ మండలంలో సుమారు ఎనిమిది గ్రామాల్లో సమ్మక్క–సారలమ్మ జాతరలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #SammakkaSaralammaJathara #MedaramJathara #TelanganaFestivals #PublicSafety #DevotionalEvent #GovernmentArrangements #TelanganaNews #TempleFestival #PeopleFirst #CulturalHeritage Follow us on Website Facebook Instagram YouTube