BREAKING
బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి సాతులూరు గ్రామంలో యువకుడి కిడ్నాప్ కలకలం. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ భారీ వర్షాలు... చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం ఉప్పరపాలెం శివారులో జూదరుల అరెస్ట్ ​ఆరుగురు పట్టివేత.. జూన్‌లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు పెదవేగి పోలీసులకు బొలెరో వాహనం అందజేత ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి సాతులూరు గ్రామంలో యువకుడి కిడ్నాప్ కలకలం. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ భారీ వర్షాలు... చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం ఉప్పరపాలెం శివారులో జూదరుల అరెస్ట్ ​ఆరుగురు పట్టివేత.. జూన్‌లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు పెదవేగి పోలీసులకు బొలెరో వాహనం అందజేత ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
www.ntodaynews.com

సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

తెలంగాణ
19 Jan, 2026 - 05:15 AM
218 వీక్షణలు
సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: ధర్మారం ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రెండు సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సమ్మక్క–సారలమ్మ వనదేవతల జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతోందని తెలిపారు. జాతర నిర్వహణలో భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జాతర సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి కొరత లేకుండా బోరు బావులు, తాత్కాలిక నీటి ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా, శుభ్రత నిర్వహణకు ప్రత్యేక చర్యలు, రవాణా సౌకర్యాల మెరుగుదలతో పాటు వైద్య శిబిరాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో కలిసి సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతర పనుల సమీక్ష సమావేశంలో పాల్గొని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ మండలంలో సుమారు ఎనిమిది గ్రామాల్లో సమ్మక్క–సారలమ్మ జాతరలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #SammakkaSaralammaJathara #MedaramJathara #TelanganaFestivals #PublicSafety #DevotionalEvent #GovernmentArrangements #TelanganaNews #TempleFestival #PeopleFirst #CulturalHeritage Follow us on Website Facebook Instagram YouTube