BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

పేదలకు వరంలా మారిన ముఖ్యమంత్రి సహాయ నిధి

తెలంగాణ
13 Jan, 2026 - 11:45 AM
90 వీక్షణలు

పేదలకు వరంలా మారిన ముఖ్యమంత్రి సహాయ నిధి

రూ.11.35 లక్షల విలువైన CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు NTODAY NEWS: విజయవాడ సెంట్రల్ మంగళవారం ఉదయం బీఆర్‌టీఎస్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో 27వ డివిజన్‌కు చెందిన దుర్గాపురం, గులాబీ తోట, బావాజీపేట ప్రాంతాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద రూ.11,35,000 విలువైన చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి పేద వర్గాల ప్రజలకు నిజంగా ఒక వరంలా మారిందని అన్నారు. రోజువారీగా ఈ సహాయం ప్రజలకు అందడం వల్ల అనేక కుటుంబాలకు ఊరట లభిస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు నిరంతరంగా సహాయం అందుతున్నట్లు పేర్కొన్నారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకెళ్లి వివరించి, కోట్ల రూపాయల సహాయాన్ని చెక్కుల రూపంలో ప్రజలకు అందించడంలో పూర్తి బాధ్యతతో పనిచేశామని తెలిపారు. లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా చెక్కులు అందేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. 2024లో మళ్లీ శాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు రూ.3 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రజలకు అందించగలిగినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతి అర్జీని పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, చెక్కులు మంజూరు అయిన వెంటనే డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, డివిజన్ నాయకుల ద్వారా లబ్ధిదారులను పిలిపించి చెక్కులు అందజేస్తున్నామని వివరించారు. ప్రజల సేవ చేయడమే తన ప్రధాన బాధ్యత అని, పదవి లేదా అధికారం అలంకారం కాదని, అది ఒక బాధ్యత మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయం, డివిజన్ నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల మెరుగైన సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా చెక్కులు అందుతున్నందుకు లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోందని, భవిష్యత్తులో మరింత బాధ్యతగా, సమర్థంగా ప్రజల కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. పాల్గొన్న వారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, 27వ డివిజన్ అధ్యక్షుడు దాసరి జయరాజు, ప్రధాన కార్యదర్శి సురేష్, మస్తాన్, దీపక్, శివ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #CMRF #ChiefMinisterReliefFund #PublicWelfare #BondaUma #VijayawadaCentral #TDP #PeopleFirst #SocialSupport #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube