BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

తెలంగాణ
28 Dec, 2025 - 04:36 AM
288 వీక్షణలు

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

NTODAY NEWS: జగిత్యాల  మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష – రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి, జగిత్యాల మరియు రాయికల్ మున్సిపాలిటీల పరిధిలో పలు ప్రభుత్వ పథకాల కింద జరుగుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం జగిత్యాల కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…  ధర్మపురి మున్సిపాలిటీతో పాటు జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల పరిధిలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాల అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు మున్సిపాలిటీల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రానున్న వేసవి కాలానికి ముందే పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలని, ఇప్పటికే పూర్తైన పనులను ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, డీఈఈలు, ఏఈఈలు, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube