BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన చరిత్ర ఎర్రజెండాదే

తెలంగాణ
16 Sep, 2025 - 06:48 PM
249 వీక్షణలు
తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన చరిత్ర ఎర్రజెండాదే మహత్తర పోరాటానికి మతంరంగు పులుముతున్న బిజెపి చార్మినార్ సీపీఎం సభలో ఎం.డి అబ్బాస్ NTODAY NEWS: హైదరాబాద్ తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సామాన్య ప్రజలను చైతన్య పరిచి సాయుధ పోరాటం నిర్వహించిన చరిత్ర ఎర్రజెండా దేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం డీ అబ్బాస్ అన్నారు. నేడు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిపిఎం హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటి శాలిబండ నుండి చార్మినార్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం చార్మినార్ వద్ద సభ నిర్వహించారు. సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగం చేశారు. ఆయన ఈ సభలో మాట్లాడుతూ 4000 మంది ప్రాణత్యాగాలతో, లక్షల ఎకరాల భూస్వాముల భూముల్ని స్వాదీనం చేసుకుని పేదలకు పంపిణీ చేసిన ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించిందన్నారు. భూస్వాములను గ్రామాలనుండి తరిమి కొట్టి, గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి, ప్రజాపాలన అంటే ఏమిటో ప్రజలకు చూపించారు కమ్యూనిస్టులని అన్నారు. వెట్టిచాకిరీని కమ్యూనిస్టు పార్టీ నిర్మూలించింది, పన్నుల చెల్లింపు నిలిపివేశారు. ఫలితంగా నైజామ్ రాజుకు దిక్కు తోచక ఇండియన్ గవర్నమెంటుతో రాజీ కుదుర్చుకున్నాడని దానిలో భాగంగానే ఆనాటి కేంద్ర కాంగ్రెస్ హోమ్ మంత్రి వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని పంపించాడని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచివేసి, ప్రజలు సాధించిన విజయాలను కాలరాసేందు భూస్వాములతో కలిసి కుట్ర చేశారని తెలిపారు. నిజామ్ రాజుకు రాజాభరణాలు ఇచ్చారని, ఇదీ చరిత్ర అని, ఈ వాస్తవాలు నేటి తరానికి చెప్పాలని అన్నారు. బిజెపి ఈ చరిత్రకు మతం రంగు పులిమి ముస్లిం రాజుకు, హిందువులకు జరిగిందని అబద్ధాలు చెప్తున్నదని బిజెపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి చారిత్రక పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బిజెపి విమోచన దినం పేరుతో హడావుడి చేయడం సిగ్గుచేటన్నారు. బిజేపి అబద్ధాలను ప్రజలలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. చార్మినార్ జోన్ సిపిఎం కన్వీనర్ అబ్దుల్ సత్తార్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా నాయకులు ఎం మీనా, జి. విటల్, పి. నాగేశ్వర్, ఎల్. కోటయ్య, ఎం శ్రవణ్ కుమార్,ఎం. బాలు, బాబార్ ఖాన్, ఎస్‌ కిషన్, ఏ కృష్ణ, కే.జంగయ్య, మరియు ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్ర జెండాలు పట్టుకొని సిపిఎం శ్రేణులు నిర్వహించిన ర్యాలీ ఆ ప్రాంత ప్రజలను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నది. Follow us on Website Facebook Instagram YouTube