జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి: సీఐటీయూ పోస్టర్ విడుదల
NTODAY NEWS:అమడగూరు మండలం రిపోర్టర్: రామాంజనేయులుఅమడగూరు మండల కేంద్రంలో సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి ఉపాధి ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.సీఐటీయూ మండల కన్వీనర్ మద్దె కేశవ, ఓడీసీ ట్రాన్స్పోర్ట్ జిల్లా ఉపాధ్యక్షుడు కుళ్లాయప్ప మాట్లాడుతూ—ఉపాధిని దెబ్బతీసే కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని, గ్రామీణ కార్మికుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు నాగరాజు, బాబావలి మాట్లాడుతూ—2005లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వామపక్ష పార్టీల కృషితో అమలులోకి వచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా కూలీలు, పేద రైతులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, అగ్రకులాలకు చెందిన పేదలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలవుతుందని గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ఒత్తిడితో ఈ పథకాన్ని నీరుగార్చేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తోందని విమర్శించారు. పాత చట్టంలో నిధుల్లో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం భరించేదని, కొత్త చట్టంతో రాష్ట్రాలపై భారం పెరిగి 40 శాతం భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందుకే ఈ కొత్త చట్టాన్ని సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మద్దె కేశవ, కుళ్లాయప్ప, వేణుగోపాల్, రమేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.#MGNREGA#SaveMGNREGA#EmploymentGuarantee#RuralEmployment#WorkersRights#CITU#SocialJustice#LabourMovement#RightToWorkFollow us onWebsiteFacebookInstagramYouTube