www.ntodaynews.com
పీఎం స్వనిధి 2.0 పథకాన్ని వినియోగించుకోవాలి
తెలంగాణ
అర్హులైన ప్రతి వీధి వ్యాపారి పీఎం స్వనిధి 2.0 పథకాన్ని వినియోగించుకోవాలి
గొల్లప్రోలు బీజేపీ అధ్యక్షుడు చిట్టా మధు
NTODAY NEWS: కాకినాడ జిల్లా – గొల్లప్రోలు ప్రతినిధి భోర శివారెడ్డి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం స్వనిధి 2.0 పథకాన్ని అర్హత ఉన్న ప్రతి వీధి చిరు వ్యాపారి సద్వినియోగం చేసుకోవాలని గొల్లప్రోలు బీజేపీ అధ్యక్షుడు చిట్టా మధు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని పిఠాపురం అర్బన్, గొల్లప్రోలు అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వీధి చిరు వ్యాపారుల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వీధి వ్యాపారులను ఆదుకునే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకాన్ని ఇప్పుడు 2030 వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు.
పీఎం స్వనిధి 2.0 పథకం ముఖ్యాంశాలు:
ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు
మొదటి విడత రుణం: రూ.10,000
రెండో విడత రుణం: రూ.20,000
మూడో విడత రుణం: రూ.50,000
సకాలంలో రుణం చెల్లిస్తే 7% వడ్డీ రాయితీ
డిజిటల్ లావాదేవీలు చేస్తే నెలకు రూ.100 క్యాష్బ్యాక్
ULB సర్టిఫికెట్ / ఐడీ కార్డు కలిగిన వారు అర్హులు
అర్హులైన వీధి వ్యాపారులు తమ సమీపంలోని సేవా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా ఆన్లైన్ పీఎం స్వనిధి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
#PMSVANidhi
#PMSVANidhi2
#StreetVendors
#SelfReliantIndia
#AtmaNirbharBharat
#SmallBusinessSupport
#CentralGovernmentSchemes
#BJP
#KakinadaDistrict
#Gollaprolu
Follow us on
Website
Facebook
Instagram
YouTube