BREAKING
మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం
Date of Publish : 07 December 2025, 08:50 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

తెలంగాణ
07 Dec, 2025 - 08:50 AM
197 వీక్షణలు

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి-- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఆదివారం రోజున మొదటి విడత పోలింగ్ జరిగే' 6' మండలాల్లో భాగంగా యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను గుర్తించి వారికి బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని తిరిగి సదరు ఓటరు తన ఓటు బ్యాలెట్ పేపర్ ను బాక్సులో వేసే వరకు పిఓలు గమనించాలన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాగంగా ఈ నెల 11న మొదటి విడత '6' మండలాల్లో జరిగే పోలింగ్ కేంద్రాలకు ముందు రోజు అవసరమైన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారని, డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మెటీరియల్ మొత్తం వచ్చిందా అని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.జిల్లాలో పోలింగ్ కేంద్రాలను  పచ్చని తోరణాలు, తదితర అవసరమైన ఏర్పాట్లు చేసి మోడల్ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కు మధ్యాహ్నం ఒంటి గంట వరకే సమయం ఉంటుందని తదుపరి రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగించాలని అన్నారు. ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లను గుర్తించడంలో చాలా జాగ్రత్త వహించాలన్నారు.ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గణేష్ నాయక్, ఎంపీడీవో నవీన్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube