www.ntodaynews.com
అంబటి వ్యాఖ్యలపై పుంగనూరులో టీడీపీ నిరసన
తెలంగాణ
అంబటి వ్యాఖ్యలపై పుంగనూరులో టీడీపీ నిరసన
ఆంబోతుకు వినతి పత్రం అందించిన టీడీపీ నాయకులు
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పుంగనూరు మండలంలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, నిరసనగా ఆంబోతుకు పూలహారం వేసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. అటువంటి నాయకుడిపై పరుష పదజాలంతో మాట్లాడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. అభివృద్ధిని సహించలేకే ప్రతిపక్ష నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్సీపీకి పరిమిత మద్దతే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, భవిష్యత్తులోనూ ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నాయకులు సంయమనం పాటించి బాధ్యతాయుతంగా మాట్లాడాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#Punganur
#TDP
#PoliticalProtest
#ChandrababuNaidu
#AmbatiRambabu
#AndhraPradeshPolitics
#Democracy
#PublicReaction
Follow us on
Website
Facebook
Instagram
YouTube