BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 21 January 2026, 09:22 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బ్యాగ్‌ను బాధితురాలికి అప్పగించిన తుని టౌన్ పోలీసులు

తెలంగాణ
21 Jan, 2026 - 09:22 AM
216 వీక్షణలు
గంటల వ్యవధిలో మర్చిపోయిన బంగారు నగల బ్యాగ్‌ను బాధితురాలికి అప్పగించిన తుని టౌన్ పోలీసులు  NTODAY NEWS:  తుని మల్లవరం గ్రామానికి చెందిన పాలిక దేవి కాకినాడ వెళ్లేందుకు తుని బస్టాండ్‌కు ఆటోలో వచ్చి బస్సు కోసం వేచి ఉన్నారు. అక్కడ నుంచి ఆలస్యం అవుతుందని, తన ఇద్దరు పిల్లలతో కలిసి గొల్ల అప్పారావు సెంటర్‌కు వెళ్లేందుకు మరోసారి ఆటో ఎక్కారు. ఈ క్రమంలో ఆమె బంగారు నగలు, నగదు ఉన్న బ్యాగ్‌ను ఆటో వెనుక భాగంలో పెట్టి, గొల్ల అప్పారావు సెంటర్ వద్ద దిగారు. అయితే ఆటోలోనే బ్యాగ్ మర్చిపోయారు. బ్యాగ్ మర్చిపోయిన విషయం తెలుసుకున్న వెంటనే తుని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ సమాచారం తెలుసుకున్న తుని టౌన్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆమె దిగిన ఆటోను గుర్తించి, ఆటో నంబర్ ద్వారా డ్రైవర్ అనిశెట్టి వీరబాబును సంప్రదించారు. ఆటోను తనిఖీ చేసిన డ్రైవర్, బ్యాగ్ ఆటో వెనుక భాగంలోనే ఉన్నట్లు గుర్తించి, దానిని తుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. బ్యాగ్‌లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు మొత్తం సురక్షితంగా ఉన్నట్లు బాధితురాలు నిర్ధారించారు. బంగారు నగల విలువ సుమారు రూ. 3,50,000గా అంచనా వేశారు. నిజాయితీగా బ్యాగ్‌ను అప్పగించిన ఆటో డ్రైవర్ అనిశెట్టి వీరబాబును పోలీసులు సత్కరించారు. ఈ కేసును గంటల వ్యవధిలో చేదించిన పోలీసు సిబ్బందిని బిందు మాధవ్ మరియు డి. శ్రీహరి రాజు అభినందించారు. #TuniPolice #HonestAutoDriver #LostAndFound #PoliceAppreciation #QuickAction #CommunityTrust #PublicSafety Follow us on Website Facebook Instagram YouTube