BREAKING
కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు
Date of Publish : 08 February 2026, 07:41 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ
08 Feb, 2026 - 07:41 PM
263 వీక్షణలు
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వేముల వీరేశం NTODAY NEWS: చిట్యాల పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం చిట్యాల 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సిలివేరు శేఖర్‌కు మద్దతుగా ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం ద్వారా పేదలకు భరోసా కల్పించిందన్నారు. చిట్యాల 10వ వార్డులో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు 90 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధి కోసం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. సామాన్య వ్యక్తులకు కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవం, గుర్తింపు ఇస్తుందని, కష్టపడే వారిని ఎలాంటి తేడాలు లేకుండా ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రజలు ఓటు వేయేటప్పుడు అందుబాటులో ఉండే నాయకుడిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో 10వ వార్డులో 75 శాతం మంది సిలివేరు శేఖర్‌కు మద్దతు తెలుపుతున్నారని పేర్కొంటూ, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కంభంపాటి సతీష్‌తో పాటు పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు, వెంకన్న, రమేష్, కొసనం అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. #CongressParty #Chityal #MunicipalElections #VemulaVeeresham #IndirammaHouses #PublicWelfare #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube