www.ntodaynews.com
కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం
తెలంగాణ
కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం: దావ వసంత సురేష్
రాయికల్లో బీఆర్ఎస్ మీడియా సమావేశం
NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్
రాయికల్ పట్టణ అభివృద్ధి మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు. గురువారం రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
కేసీఆర్ పాలనలోనే రాయికల్ అభివృద్ధి
గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ను మున్సిపాలిటీగా మార్చి, రూ. 25 కోట్ల నిధులతో ప్రతి వార్డును అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు.
“రాయికల్ పట్టణంలో జరిగిన ప్రతి అభివృద్ధి పని బీఆర్ఎస్ పాలనలోనే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క పని కూడా ప్రారంభించలేదు” అని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేశామని, చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేపై విమర్శలు
అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పిన ఎమ్మెల్యేపై ఆమె ప్రశ్నలు సంధించారు.
అభివృద్ధి కోసమే పార్టీ మారితే రాయికల్–మైథాపూర్, ఇటిక్యాల బ్రిడ్జి పనులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు.
కార్యకర్తల కష్టంతో గెలిచి, స్వప్రయోజనాల కోసమే పార్టీ మారారని విమర్శించారు.
ప్రభుత్వంతో కలిసి పని చేస్తానన్న ఎమ్మెల్యేకు గాంధీ భవన్లో ఏ పని ఉందని నిలదీశారు.
హామీల అమలు ఎక్కడ?
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ చేస్తారు?
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తారు?
పెన్షన్లు రూ. 2000 నుంచి రూ. 4000కి ఎప్పుడు పెంచుతారు?
బీఆర్ఎస్ హయాంలో మంజూరైన 60 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు ఎందుకు నిలిపివేశారు?
డైవర్షన్ రాజకీయాలు
మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు ఇస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
పాల్గొన్న నాయకులు
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వాసం రాజేందర్, కోఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉదయశ్రీ లింగన్న, మండల అధ్యక్షుడు బర్కాం మల్లేష్, మాజీ కౌన్సిలర్లు శ్రీరాములు, సత్యనారాయణ, మహేష్ గౌడ్, మహేందర్, వనిత గణేష్, సోహెల్, బాబా, ప్రశాంత్ రావు, లింగన్న తదితరులు పాల్గొన్నారు.
#BRSParty
#DavaVasanthaSuresh
#Raikal
#TelanganaPolitics
#CongressFailure
#DevelopmentPolitics
#KCR
#LocalBodyElections
#JagtialDistrict
#PoliticalNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube