
వీడియో కాల్లో తుపాకులతో బెదిరింపులు: ముగ్గురు అరెస్ట్
NTODAY NEWS: జగిత్యాల జిల్లా, కోరుట్ల
కోరుట్ల పట్టణంలో వీడియో కాల్లో తుపాకులు చూపించి బెదిరించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోరుట్ల సెల్ పాయింట్ అసోసియేషన్ అనే పేరుతో మార్త శివకుమార్, భోగ శ్రీనివాస్, అడ్డగడ్ల సురేష్ అనే వ్యక్తులు ఎయిర్టెల్ నెట్వర్క్ వ్యాపారం చేయాలంటే అసోసియేషన్కు రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ బెదిరింపులకు భయపడి బాధితులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా రూ.30 వేల మొత్తాన్ని వారికి పంపించినట్లు విచారణలో తేలింది. ఎయిర్టెల్ డివిజన్ డిస్ట్రిబ్యూటర్ దండబోయిన అరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
నిందితుల వద్ద నుంచి ఒక ఎయిర్ గన్ రైఫిల్, ఒక ఎయిర్ గన్ పిస్టల్, ఒక తల్వార్, మూడు చిన్న కత్తులు, ఒక మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, పట్టణంలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే అటువంటి వ్యక్తులపై రౌడీషీట్ తెరిచి పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube