www.ntodaynews.com
గ్రామంలో పులి సంచారం – దూడ మృతి
తెలంగాణ
రాళ్ల జనగం గ్రామంలో పులి సంచారం – దూడ మృతి
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగం గ్రామ పరిధిలోని వ్యవసాయ బావి వద్ద పులి సంచారం కలకలం రేపింది. ఈ ఘటనలో పులి దాడి చేసి ఓ దూడను చంపి రక్తం పీల్చినట్లు గ్రామస్తులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతును ఓదార్చి, ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
అటవీ శాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పులి కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, పశువులను రాత్రి వేళల్లో సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు. చీకటి పడేలోపు రైతులు గ్రామానికి చేరుకోవాలని తెలిపారు.
పులి సంచారం నేపథ్యంలో గ్రామంలో భయాందోళనలు నెలకొనగా, అటవీ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
#TigerMovement
#WildlifeAlert
#YadadriBhuvanagiri
#Alair
#ForestDepartment
#RuralNews
#TelanganaNews
#PublicSafety
#NtodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube