BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

శ్రీశైలంలో పాగాలంకరణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

తెలంగాణ
14 Feb, 2026 - 08:28 PM
257 వీక్షణలు
శ్రీశైలంలో పాగాలంకరణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో శివరాత్రి రోజు నిర్వహించనున్న పాగాలంకరణ కార్యక్రమానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మరియు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, పాగాలంకరణ దర్శనం సందర్భంగా భక్తులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. క్యూ లైన్లు, రాకపోకల మార్గాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, భక్తులు క్రమబద్ధంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాగాలంకరణ సమయంలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. తాగునీరు, వైద్య సాయం వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సిబ్బందిని నియమించి, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. భక్తులు సంయమనం పాటిస్తూ అధికారుల సూచనలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు. #Srisailam #Mahashivaratri #Pagalankarana #NandyalDistrict #PoliceBandobast #TempleSecurity #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube