BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 14 February 2026, 08:28 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీశైలంలో పాగాలంకరణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

తెలంగాణ
14 Feb, 2026 - 08:28 PM
352 వీక్షణలు
శ్రీశైలంలో పాగాలంకరణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో శివరాత్రి రోజు నిర్వహించనున్న పాగాలంకరణ కార్యక్రమానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మరియు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, పాగాలంకరణ దర్శనం సందర్భంగా భక్తులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. క్యూ లైన్లు, రాకపోకల మార్గాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, భక్తులు క్రమబద్ధంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాగాలంకరణ సమయంలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. తాగునీరు, వైద్య సాయం వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సిబ్బందిని నియమించి, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. భక్తులు సంయమనం పాటిస్తూ అధికారుల సూచనలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు. #Srisailam #Mahashivaratri #Pagalankarana #NandyalDistrict #PoliceBandobast #TempleSecurity #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube