BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
02 Jun, 2026 - 05:30 PM
105 వీక్షణలు

ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షులు పల్లపు బుద్ధుడు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని కొనియాడారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర సాధన కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ఈ కమిటీ పారదర్శకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా జూన్ 4న జరగబోయే 'కె. కేశవరావు ప్రత్యేక కమిటీ' సమావేశంలో విధివిధానాలను త్వరగా ఖరారు చేసి, ఉద్యమకారుల గుర్తింపుపై ప్రభుత్వం త్వరితగతిన అధికారిక ప్రకటన (డిక్లరేషన్) చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలు, మేధావులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగుల త్యాగాలకు తగిన గౌరవం దక్కినప్పుడే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తుందని, ఈ నిర్ణయం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని పల్లపు బుద్ధుడు పేర్కొన్నారు.