BREAKING
ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్‌పై చంద్రబాబు ప్రచారం! మత్తుకు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ కావాల్సిందే: సుప్రీంకోర్టు వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం చర్లపల్లి జైలు నుంచి అర్హత సాధించిన ఖైదీల విడుదల తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టులో నేడు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం తెలంగాణకు వర్ష సూచన.. రానున్న 4 రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్‌పై చంద్రబాబు ప్రచారం! మత్తుకు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ కావాల్సిందే: సుప్రీంకోర్టు వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం చర్లపల్లి జైలు నుంచి అర్హత సాధించిన ఖైదీల విడుదల తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టులో నేడు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం తెలంగాణకు వర్ష సూచన.. రానున్న 4 రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి
www.ntodaynews.com

ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
02 Jun, 2026 - 05:30 PM
8 వీక్షణలు

ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షులు పల్లపు బుద్ధుడు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని కొనియాడారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర సాధన కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ఈ కమిటీ పారదర్శకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా జూన్ 4న జరగబోయే 'కె. కేశవరావు ప్రత్యేక కమిటీ' సమావేశంలో విధివిధానాలను త్వరగా ఖరారు చేసి, ఉద్యమకారుల గుర్తింపుపై ప్రభుత్వం త్వరితగతిన అధికారిక ప్రకటన (డిక్లరేషన్) చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలు, మేధావులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగుల త్యాగాలకు తగిన గౌరవం దక్కినప్పుడే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తుందని, ఈ నిర్ణయం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని పల్లపు బుద్ధుడు పేర్కొన్నారు.