BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 02 June 2026, 05:30 pm
Posted by : కూనురు మధు

ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
02 Jun, 2026 - 05:30 PM
138 వీక్షణలు

ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షులు పల్లపు బుద్ధుడు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని కొనియాడారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర సాధన కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ఈ కమిటీ పారదర్శకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా జూన్ 4న జరగబోయే 'కె. కేశవరావు ప్రత్యేక కమిటీ' సమావేశంలో విధివిధానాలను త్వరగా ఖరారు చేసి, ఉద్యమకారుల గుర్తింపుపై ప్రభుత్వం త్వరితగతిన అధికారిక ప్రకటన (డిక్లరేషన్) చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలు, మేధావులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగుల త్యాగాలకు తగిన గౌరవం దక్కినప్పుడే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తుందని, ఈ నిర్ణయం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని పల్లపు బుద్ధుడు పేర్కొన్నారు.