BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఉక్కపోతలో ఉడికిపోతున్న విద్యార్థులు.. ఒంటిపూట బడులు లేదా సెలవులు ఇవ్వాలంటున్న తల్లిదండ్రులు..!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 03:26 PM
65 వీక్షణలు

ఉక్కపోతలో విద్యార్థుల ఇబ్బందులు.. ఒంటిపూట బడులు లేదా సెలవులు పొడిగించాలంటున్న తల్లిదండ్రులు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో గత రెండు రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్కపోత పరిస్థితులు నెలకొన్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు రోజువారీగా బడులకు హాజరవుతున్నారు.

తీవ్ర వేడిమి కారణంగా తరగతుల్లో విద్యార్థులు కూర్చోవడం కూడా కష్టంగా మారిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నారులు అలసటకు గురవుతున్నారని పేర్కొంటున్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలలకు మరికొంతకాలం సెలవులు ప్రకటించాలా లేదా ఒంటిపూట బడుల విధానం అమలు చేయాలా అనే విషయంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

వాతావరణ పరిస్థితులు ఇంకా కొనసాగితే విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.