www.ntodaynews.com
ఉమింగ్ శిఖరం ఎక్కి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన డేవి చందు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా పెదవేగి మండలం, రామసింగవరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతాల ఏసుదాసు కుమారుడు డేవి చందు ప్రపంచంలోనే ఎత్తైన మోటార్ రహదారిగా గుర్తింపు పొందిన లడాఖ్ ప్రాంతంలోని ఉమింగ్ లా పాస్ శిఖరం (5,798 మీటర్లు)ను అధిరోహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.
మే 22న ఏలూరు నుంచి బయలుదేరిన ఆయన హైదరాబాద్, ఆగ్రా, అమృత్సర్, శ్రీనగర్ మీదుగా కార్గిల్ చేరుకున్నారు. మే 31న కార్గిల్ నుంచి లేహ్, నుబ్రా, పాంగాంగ్ మార్గంగా ప్రయాణం కొనసాగించారు. జూన్ 4న ఉమింగ్ లా పాస్ శిఖరాన్ని చేరుకుని లక్ష్యాన్ని సాధించారు.
తిరుగు ప్రయాణంలో జూన్ 10న హైదరాబాద్ చేరుకుని, అనంతరం మొత్తం 8 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసి ఏలూరుకు చేరుకోనున్నారు.