www.ntodaynews.com
భారతీయ జనతా పార్టీ సమిష్టి నిర్ణయంతో కొండమడుగు గ్రామ శాఖ ఆధ్వర్యంలో
తెలంగాణ
భారతీయ జనతా పార్టీ సమిష్టి నిర్ణయంతో కొండమడుగు గ్రామ శాఖ ఆధ్వర్యంలో
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
కొండమడుగు గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి సొంత ఇల్లు, జాగా లేకుండా అద్దె కడుతూ జీవితాలను నెట్టుకుంటూ వస్తున్నటువంటి ఇంటి స్థలం మరియు ఇల్లు లేని పేద ప్రజల కొరకు అండగా నిలవడానికి భారతీయ జనతా పార్టీ నడుంబిగించింది అని తెలియజేశారు. ఎన్నో రాజకీయ పార్టీలు మరియు రాజకీయ నాయకులు ఇంటి స్థలం, ఇల్లు ఇస్తాం అని ఆశ చూపించి ఓట్లు వేయించుకొని గెలిచాక మొహం చాటేశారు. అందుకే ఇంటి స్థలం మరియు ఇల్లు లేని పేద ప్రజల పక్షాన నిలబడుటకై మరియు కొండమడుగు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 120 అంగార్లం బండ ( ఎర్ర చెల్క )లో దాదాపుగా ఏడు ఎకరాల పైచిలుకు భూమిని పేదలకు పంచేవరకు ముందుంటుందని పార్టీ నాయకులు తెలియజేశారు , రానున్న స్థానిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఎన్ని అడ్డంకులు సృష్టించిన పేదలకు ఇంటి స్థలాల పంపిణీ చేసేవరకు నిద్రపోమని తెలియజేశారు. ఈ కార్యక్రమం శ్రీ శ్రీ శ్రీ సీత రామచంద్రుల ఆలయంలో పూజల అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద లే-ఔట్ నమూనానీ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube