BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 30 January 2026, 10:35 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మహా శివరాత్రి జాతర పోస్టర్ల ఆవిష్కరణ

తెలంగాణ
30 Jan, 2026 - 10:35 AM
172 వీక్షణలు
మహా శివరాత్రి జాతర పోస్టర్ల ఆవిష్కరణ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్‌కు జాతర ఆహ్వానం NTODAY NEWS: వేములవాడ ఈ నెల 14వ తేదీ నుంచి వేములవాడలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాతరకు సంబంధించిన పోస్టర్లను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అధికారులు మరియు అర్చకులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఈవో, అర్చకులు ఇంచార్జి కలెక్టర్‌కు మహా శివరాత్రి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏర్పాట్లపై సమీక్ష ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ నెల 14 నుంచి 16 వరకు వేములవాడలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 15వ తేదీన ప్రధాన మహా శివరాత్రి జాతర జరగనుందని వెల్లడించారు. జాతర సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాల్గొన్న అధికారులు ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, మైపాల్ రెడ్డి, ఆలయ ఏఈఓలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, జి. శ్రావణ్, జి. అశోక్, అర్చకులు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. #MahaShivaratri #Vemulawada #ShivaTemple #TempleFestival #DistrictAdministration #Pilgrimage #TelanganaCulture Follow us on Website Facebook Instagram YouTube