ఉపాధ్యాయులే భవిష్యత్తుకు శిల్పులు: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ గురువులకు శుభాకాంక్షలు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మన భవిష్యత్తుకు నిజమైన శిల్పులు ఉపాధ్యాయులేనని అన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో గురువుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు ఎంతో ముఖ్యమైనవని తెలిపారు.