BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఉరుమడ్ల లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
31 May, 2026 - 07:00 PM
476 వీక్షణలు

పూర్వ విద్యార్థులు తమ కుటుంబాలను వృద్ధి చేసుకుంటూనే, సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జడ్పీహెచ్ఎస్ ఉరుమడ్ల మాజీ ప్రధానోపాధ్యాయులు రంగరాజు లక్ష్మీ నరసింహారావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉరుమడ్ల గ్రామంలోని ఎస్.వి. గార్డెన్‌లో 1992-2002 బ్యాచ్‌కు చెందిన 1 నుండి 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 

​ముఖ్య అతిథిగా  రంగరాజు లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనాలు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను, స్నేహాన్ని గుర్తుచేసుకునే అద్భుత అపురూపమైన సమయమని కొనియాడారు. అనంతరం పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కుకుడాల గోవర్ధన్  మాట్లాడుతూ ఉరుమడ్ల పాఠశాల ప్రారంభమై  యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్వరలోనే అర్థ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ద్వారానే పేదలకు నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని, పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి, ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు (ఎన్రోల్మెంట్) పెంపునకు కృషి చేయాలని కోరారు. ఆపదలో ఉన్న తోటి స్నేహితులను ఆదుకోవడమే నిజమైన స్నేహ బంధమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి, సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. గతంలో పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు చొల్లేటి యోగేంద్రనాథ్, చోల్లేటి పాండు రంగాచారి, వడ్డెగాని యాదగిరి, యం.డి పాషా, కరామతుల్లా, యన్.శ్యాంసుందర్, వి.రవీందర్, కే.నారాయణ, చొల్లేటి వెంకట నరసింహాచారి, జి. శంబయ్య, పి.నోములు, కే.అనంత రెడ్డి, సుంకరి సంధ్యా రాణి, ఉయ్యాల యాదయ్య, సాగర్ల లింగయ్య, గౌరీ శంకర్ తదితరులను పూర్వ విద్యార్థులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో 2001-2002 బ్యాచ్ నిర్వాహకులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.