BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

యూరియా బుకింగ్ యాప్ రద్దు చేయాలి

తెలంగాణ
28 Feb, 2026 - 01:12 AM
86 వీక్షణలు
యూరియా బుకింగ్ యాప్ రద్దు చేయాలి: సిపిఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం NTODAY NEWS: బొమ్మలరామారం పాత విధానంలోనే ఎరువుల సరఫరా చేయాలని డిమాండ్ బొమ్మలరామారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్‌ను రద్దు చేసి, పాత విధానంలోనే ఎరువుల సరఫరా కొనసాగించాలని సిపిఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం డిమాండ్ చేశారు. మండలంలోని మర్యాల గ్రామంలో దేశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన శనివారం నిర్వహించిన గ్రామ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్త యాప్ విధానం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎరువులు సకాలంలో అందకపోతే పంటలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే దేశీయ రైతులు నష్టపోతారని పేర్కొన్నారు. విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, యూరియా యాప్‌ను రద్దు చేసి పాత విధానంలోనే ఎరువులు అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గ్రామ కార్యదర్శి ముద్దం మధుసూదన్ రెడ్డి, ప్యారారం వెంకటేష్, దేవేందర్, బండ కొమురయ్య, మంద రాజు, నల్లగొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. #Bommalaramaram #CPM #FarmersIssues #UreaApp #AgriculturePolicy #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube