BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
www.ntodaynews.com

యూరియా బుకింగ్ యాప్ రద్దు చేయాలి

తెలంగాణ
28 Feb, 2026 - 01:12 AM
119 వీక్షణలు
యూరియా బుకింగ్ యాప్ రద్దు చేయాలి: సిపిఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం NTODAY NEWS: బొమ్మలరామారం పాత విధానంలోనే ఎరువుల సరఫరా చేయాలని డిమాండ్ బొమ్మలరామారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్‌ను రద్దు చేసి, పాత విధానంలోనే ఎరువుల సరఫరా కొనసాగించాలని సిపిఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం డిమాండ్ చేశారు. మండలంలోని మర్యాల గ్రామంలో దేశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన శనివారం నిర్వహించిన గ్రామ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్త యాప్ విధానం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎరువులు సకాలంలో అందకపోతే పంటలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే దేశీయ రైతులు నష్టపోతారని పేర్కొన్నారు. విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, యూరియా యాప్‌ను రద్దు చేసి పాత విధానంలోనే ఎరువులు అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గ్రామ కార్యదర్శి ముద్దం మధుసూదన్ రెడ్డి, ప్యారారం వెంకటేష్, దేవేందర్, బండ కొమురయ్య, మంద రాజు, నల్లగొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. #Bommalaramaram #CPM #FarmersIssues #UreaApp #AgriculturePolicy #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube