BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 08 March 2026, 04:42 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నీటిని పొదుపుగా వాడుకోవాలి

తెలంగాణ
08 Mar, 2026 - 04:42 AM
368 వీక్షణలు
నీటిని పొదుపుగా వాడుకోవాలి: మద్ధుల గోపాల్ రెడ్డి NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్ధుల గోపాల్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం సూరారం గ్రామ సర్పంచ్ కొడిపెల్లి కొమురమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జల్ మహోత్సవం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక వీధుల్లో నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కందికట్ల అమృత రాజేష్ (గోడిసెలపేట సర్పంచ్), మురళి (మిషన్ భగీరథ ఇంజనీర్), గుండేటి గోపిక జితేందర్ రెడ్డి (ఏఎంసీ చైర్మన్), కొంగల రాంరెడ్డి, గూడ రాంరెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు పంజా సాయి, గర్శకుర్తి దిలీప్, గోపు రాకేష్, మొగిలి శేఖర్, చిలువేరి వెంకటేష్, బద్దపురి హరీష్, నాగభూషణం, లచ్చయ్య మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #JalMahotsav #WaterConservation #MaddulaGopalReddy #Velgatoor #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube