BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

నీటిని పొదుపుగా వాడుకోవాలి

తెలంగాణ
08 Mar, 2026 - 04:42 AM
322 వీక్షణలు
నీటిని పొదుపుగా వాడుకోవాలి: మద్ధుల గోపాల్ రెడ్డి NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్ధుల గోపాల్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం సూరారం గ్రామ సర్పంచ్ కొడిపెల్లి కొమురమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జల్ మహోత్సవం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక వీధుల్లో నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కందికట్ల అమృత రాజేష్ (గోడిసెలపేట సర్పంచ్), మురళి (మిషన్ భగీరథ ఇంజనీర్), గుండేటి గోపిక జితేందర్ రెడ్డి (ఏఎంసీ చైర్మన్), కొంగల రాంరెడ్డి, గూడ రాంరెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు పంజా సాయి, గర్శకుర్తి దిలీప్, గోపు రాకేష్, మొగిలి శేఖర్, చిలువేరి వెంకటేష్, బద్దపురి హరీష్, నాగభూషణం, లచ్చయ్య మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #JalMahotsav #WaterConservation #MaddulaGopalReddy #Velgatoor #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube